Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు... దోషులను వేరు చేసిన అధికారులు

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:40 IST)
నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరిశిక్షలను అమలు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా పలు చర్యలు చేపట్టడమేకాకుండా, జైలులో అనేక రకాలైన ఆంక్షలు కూడా విధించారు. 
 
ముఖ్యంగా నలుగురు దోషులు ఒకరినొకరు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముఖేశ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌‌లు ఇప్పటివరకు జైలులో ఉదయం వేళ ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేవారు. 
 
అయితే, ఉరితీత సమయం దగ్గర పడుతుండడంతో వారు కలుసుకుని మాట్లాడుకోకుండా నిషేధం విధించారు. మరోవైపు, తీహార్ జైలులో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు. 
 
మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తీసుకువచ్చారు. జైలులోని ఉరితీసే గదిని శుభ్రం చేశారు. తుప్పు పట్టిన ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. మరణశిక్షను అమలుచేయడానికి మిగిలిన అన్ని ప్రక్రియలను వెంటనే పూర్తిచేసి వీలైనంత త్వరగా దోషులను ఉరితీయాలన్నారు. యావత్‌ దేశ ప్రజానీకం నిర్భయకు న్యాయం జరుగాలంటూ.. దోషులను తక్షణమే ఉరితీయాలంటూ కోరుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments