Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణిని కాటేసిన కరోనా వైరస్.. నిండు గర్భిణి బలి

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:05 IST)
కరోనా వైరస్ నిండు గర్భిణి మహిళను కాటేసింది. కరోనా వైరస్‌ కాటుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి బలైంది. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న స్థితిలో శనివారం రాత్రి ముంబైలోని బివైఎల్‌ నాయర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
 
ఈమె పరిస్థితిని బట్టి కరోనా ఉండొచ్చని అంచనా వేసిన వైద్యులు ఆమెను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, అత్యవసర చికిత్స అందించారు. కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేశారు. అయితే ఆమె ఆరోగ్య స్థితి మరింత దిగజారటంతో... కొద్ది గంటల్లోనే మృతిచెందింది. 
 
గర్భంలోని శిశువు కూడా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం వెలువడిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, నాయర్‌ ఆస్పత్రికి తీసుకురావటానికి ముందు ఆమెను చేర్చుకోవటానికి రెండు ఆస్పత్రులు తిరస్కరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments