Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతూరుకు వలస కూలీలు ... రోడ్డుపై ప్రసవం.. ఆ వెంటనే నడక

Webdunia
బుధవారం, 13 మే 2020 (11:11 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. అయితే, ఇటీవల లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. ముఖ్యంగా, వలస కూలీలు తమతమ సొంతూళ్ళకు వెళ్లేందుకుగాను రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు అనుమతిచ్చింది. పైగా, వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను కూడా కేంద్రం నడుపుతోంది. అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ప్రాంతాలకు చెందిన వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్ వలస కూలీలు కూడా తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఇందులో ఓ నిండు గర్భిణి కూడా తన భర్తతో కలిసి తమ స్వస్థలమైన సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది. నెలలు నిండటంతో మార్గమధ్యంలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, రోడ్డు పైనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, ప్రసవించిన రెండుగంటల తర్వాత తమ బిడ్డతో సహా భార్యాభర్త తిరిగి నడక ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డతో కలిసి మరో 150 కిలో మీటర్లు నడిచింది. సత్నా సరిహద్దులో వారిని అధికారులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments