Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ.. అక్టోబర్ 2న బీహార్‌లో ప్రారంభం

వరుణ్
గురువారం, 11 జులై 2024 (15:09 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనే పేరు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేదు. 2019 ఎన్నికలలో జగన్ అద్భుతమైన విజయం వెనుక ఉన్న వ్యక్తి ఆయన. అయితే 2024లో వైసీపీ ఓడిపోయింది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ముందే ఊహించారు. అది మళ్లీ నిజమైంది.
 
ఇక కట్ చేస్తే ప్రశాంత్ కిషోర్ తాజా అప్‌డేట్ ఆంధ్రా రాజకీయాల గురించి కాదు. బదులుగా ప్రశాంత్ స్వంత రాష్ట్రం బీహార్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న బీహార్‌లో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు.
 
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీకే కొత్త పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. పీకే ఇంతకుముందు బీహార్‌లో జన్ సూరజ్ యాత్రకు వెళ్ళారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్నందున బీహార్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ కొత్త రాజకీయ సంస్థ ద్వారా జన్ సూరజ్ యాత్ర ఊపును ఉపయోగించుకోవాలని ప్రశాంత్ కిషోర్ ఆశిస్తున్నారు. పీకే రాజకీయ వ్యూహకర్తగా చాలా వరకు విజయం సాధించినప్పటికీ, రాజకీయ ఎంట్రీ ఏమేరకు లాభిస్తుందో.. లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments