Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పుడు అఫిడవిట్... ప్రాసిక్యూట్‌కు ఓకే.. ఫడ్నవిస్‌కు సుప్రీం షాక్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (13:50 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125 మేరకు అనుమతి ఇచ్చింది.
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, అందులో క్రిమినల్ కేసులను చేర్చలేదంటూ సతీష్ యుకీ అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 
 
అలాగే, ఇదే కేసులో ఫడ్నవిస్‌కు కింది కోర్టు, ముంబై హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. తప్పుడు అఫిడవిట్ అనేది చట్టప్రకారం అంగీకారయోగ్యం కాదని, ఆ ప్రకారం దిగువ కోర్టుల తీర్పును కొట్టివేస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది. 
 
దీంతో తప్పుడు అఫిడవిట్ కేసులో ఫడ్నవిస్ తాజా విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. కాగా, ఈనెల 21వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments