Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పుడు అఫిడవిట్... ప్రాసిక్యూట్‌కు ఓకే.. ఫడ్నవిస్‌కు సుప్రీం షాక్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (13:50 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125 మేరకు అనుమతి ఇచ్చింది.
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, అందులో క్రిమినల్ కేసులను చేర్చలేదంటూ సతీష్ యుకీ అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 
 
అలాగే, ఇదే కేసులో ఫడ్నవిస్‌కు కింది కోర్టు, ముంబై హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. తప్పుడు అఫిడవిట్ అనేది చట్టప్రకారం అంగీకారయోగ్యం కాదని, ఆ ప్రకారం దిగువ కోర్టుల తీర్పును కొట్టివేస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది. 
 
దీంతో తప్పుడు అఫిడవిట్ కేసులో ఫడ్నవిస్ తాజా విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. కాగా, ఈనెల 21వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments