Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (16:09 IST)
దేశంలోని రాజకీయ నేతలు, ధనవంతులంతా ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో చనిపోవాలని, అపుడే వారికి మోక్షం లభిస్తుందని బీహార్ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజ్ (పప్పు యాదవ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ఈ మహాకుంభమేళా వేడుకలు అత్యంత ఆధ్యాత్మికతతో జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. దీనిపై పప్పూ యాదవ్ స్పందిస్తూ, కుంభమేళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారు మోక్షం పొందినట్టు ఒక బాబా చెప్పారని, అందువల్ల బాబాలు, సంపన్నులు, రాజకీయ నేతలు త్రివేణి సంగమంలో చనిపోయి మోక్షం పొందాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై లోక్‌సభలో మాట్లాడుతూ, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట తర్వాత 300 నుంచి 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయివుంటారని, వారి మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని పేర్కొన్నారు. మృతులకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పైగా, కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందినట్టు ఒక బాబా చెప్పారని, అందువల్ల మన దేశంలోని రాజకీయ నేతలు, ధనవంతులు, బాబాలు కూడా త్రివేణి సంగమంలో మునిగి చనిపోయి మోక్షం పొందాలని పప్పు వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments