Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పేలుడు పదార్థాల కలకలం

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:30 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఈ పదార్థాలను గుర్తించాయి. ముఖ్యంగా అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్ వంతెన కింద మొత్తం 6 కేజీల జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆలయ భద్రతా అధికారులు బాంబు స్క్వాడ్‌లను రంగంలోకి దించి ఆలయ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. 
 
ఇటీవల మకర జ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇలా వచ్చిన భక్తులే ఈ పేలుడు పదార్థాలు తరలించివుంటారని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, మకర జ్యోతి దర్శనం అనంతరం శబరిమల ఆలయాన్ని గురువారం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, భారత 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా, రద్దీ ప్రాంతాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో శబరిమల ఆలయం వద్ద ఈ పేలుడు పదార్థాలను గుర్తించడం కలకలం రేపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments