Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పేలుడు పదార్థాల కలకలం

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:30 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఈ పదార్థాలను గుర్తించాయి. ముఖ్యంగా అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్ వంతెన కింద మొత్తం 6 కేజీల జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆలయ భద్రతా అధికారులు బాంబు స్క్వాడ్‌లను రంగంలోకి దించి ఆలయ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. 
 
ఇటీవల మకర జ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇలా వచ్చిన భక్తులే ఈ పేలుడు పదార్థాలు తరలించివుంటారని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, మకర జ్యోతి దర్శనం అనంతరం శబరిమల ఆలయాన్ని గురువారం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, భారత 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా, రద్దీ ప్రాంతాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో శబరిమల ఆలయం వద్ద ఈ పేలుడు పదార్థాలను గుర్తించడం కలకలం రేపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments