Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ వ్యాపారులను దోచుకున్నారు... ఎవరు?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:53 IST)
తప్పు చేస్తే శిక్ష విధించాల్సిన పోలీసులే అక్రమానికి పాల్పడితే ఏం చేయాలి? కరోనా లాక్‌డౌన్‌ని అడ్డుపెట్టుకుని వ్యాపారుల నుండి కోట్ల రూపాయలు బలవంతంగా గుంజారు. సిగరెట్ వ్యాపారుల నుంచి సుమారు రూ.1.75 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, అజయ్‌లపై ఆరోపణలు వచ్చాయి. 
 
ఇలా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన విషయం డీజీపీ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరపగా ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కేసు నమోదైంది. పోలీసు అధికారుల నుంచి రూ.52 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ మేరకు డీజీపీకి నివేదిక అందజేశారు. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని పోలీసు ఉన్నతాధికార వర్గాలు యోచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments