Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (16:27 IST)
పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రాహుల్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందించారు. 
 
కాగా, తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్‌పై కేసు నమోదు చేయాలని కోరారు. బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 115, 117, 131, 351 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
 
మరో పక్క తోపులాట ఘటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కింద పడిపోవడంతో గాయపడ్డారని, బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో అధికార పార్టీ ఎంపీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. దీనిపై డీసీపీ (న్యూఢిల్లీ) దినేశ్ మహ్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఇరు పక్షాలు సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments