Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (16:17 IST)
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. కొత్త యేడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. నిజానికి వీటిని ఇప్పటి వరకు ఆఫ్‌లైన్, పోస్టల్ విధానం ద్వారానే విక్రయిస్తూ వచ్చారు. అయితే, ఇకపై ఆన్‌‍లైన్‌లోనే ఆర్డర్ చేసే వారికి క్యాలెండర్లు, డైరీలను పంపిస్తామని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 
 
2025 యేడాదికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫొటోతో క్యాలెండర్లను తయారుచేసినట్లు చెప్పారు. 
 
వీటితో పాటు డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని వివరించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైనులో బుక్ చేసుకోవచ్చని అన్నారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని ప్రముఖ బుక్ స్టోర్లలో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చని బీఆర్ నాయుడు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments