Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపైకి రావొద్దని చెప్పినందుకు ఏఎస్ఐ చేతి నరికేశారు...

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (15:57 IST)
లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి రావొద్దంటూ సూచనలు చేసిన ఏఎస్ఐ చేతిని నరికేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో జరిగింది. మండీ బ‌జార్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని పరిశీలిస్తే, కర్ఫ్యూ నడుస్తున్నందున పాసులు చూపించాలని యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేట్లను జీపుతో గుద్దుకుంటూ వెళ్లిపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కత్తులతో దాడికిపాల్పడ్డారు. 
 
ఈ దాడిలో ఏఎస్‌ఐ చేతు పూర్తిగా తెగిపోయింది. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన చండీఘడ్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్‌ఐ హర్జిత్‌ సింగ్‌ చేతికి సర్జరీ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులందరిని గుర్తించామని, నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వేగంగా స్పందింస్తూ, దాడికి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు. ఓ ప్రార్థనా మందిరం నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments