Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (15:13 IST)
PM Modi
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్.. ఇవాళ మరో మైలురాయిని అందుకుంది. 
 
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత జోరుకు ఐఎన్ఎస్ విక్రాంత్ సరైన ఉదాహరణ అని మోదీ కొనియాడారు. దీంతో పాటు నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు. 
Vikas
 
వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్ తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతకాన్ని రూపొందించారు. నూతన పతాకంలో ఎడమవైపు భాగంలో జాతీయ పతాకం వుంది. 
 
కుడివైపు అష్ట భుజులు రెండు ఉన్నాయి. వాటి మధ్య ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం వుంది. ఈ లంగరు క్రింత "సం నో వరుణః" అనే నినాదం వుంది. దీనిని వేదాల నుంచి స్వీకరించారు. 
Vikas
 
ఈ కార్యక్రమంలో భాగంగా నావికా దళం కోసం కొత్తగా రూపొందించిన పతకాన్ని మోదీ ఎగురవేశారు. ఇప్పటివరకు నౌకాదళానికి బానిస గతాన్ని గుర్తుచేసే చిహ్నం వుండేది. 
 
ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించుకున్నాం. దేశ బానిసత్వ గతాన్ని ఇది చెరిపేస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. 
vikas

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments