11 రోజులు దీక్షలో ప్రధాని.. నేలపై నిద్ర.. కొబ్బరి నీళ్లు తాగుతూ..?

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (19:21 IST)
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు. జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని నియమాలు, ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. 11 రోజుల పాటు దీక్షలో వున్నారు. 
11-రోజుల పాటు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ తపస్సు, ధాన్యంతో గడుపుతున్నారు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తీసుకోవడం లేదు. ఈ దీక్షలో భాగంగా ప్రధాని కేవలం దుప్పటితో నేలపై నిద్రిస్తున్నారని, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
జనవరి 12 నుండి ఆలయ సంప్రోక్షణకు సంబంధించిన ఆచారాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ట" కోసం ప్రధాని మోదీ పూజలు చేస్తారని వర్గాలు తెలిపాయి. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ప్రాణ్ ప్రతిష్ట ప్రధాన కర్మలను నిర్వహిస్తుంది.
 
"ప్రాణ్ ప్రతిష్ట" అంటే విగ్రహాన్ని దైవిక స్పృహతో నింపడం, ప్రతి ఆలయంలో పూజించే ప్రతి విగ్రహానికి ఇది తప్పనిసరి. జనవరి 22 న మధ్యాహ్నం 12.30 గంటలకు దీనికి అనుకూలమైన సమయం అని ఆలయ కమిటీ తెలిపింది.
 
 
 
మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేత చెక్కబడిన ఐదేళ్ల వయసులో వున్న రాముడు నల్లరాతితో చెక్కబడిన రామ్ లల్లా విగ్రహాన్ని గత రాత్రి ఆలయానికి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments