నేటి నుంచి వందే భారత్ నాలుగో రైలు.. త్వరలో సరకు రవాణా కోసం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (09:16 IST)
దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఈ రైళ్లను వందే భారత్ పేరుతో నడుపుతోంది. ఇప్పటికే మూడు రైళ్లు పట్టాలెక్కాయి. గురువారం నాలుగో రైలును నడుపనున్నారు. ఈ రైలు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అందౌరా స్టేషన్‌ల మధ్య నడుపనున్నారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉనా జిల్లాలో జరుగనుంది. 
 
మరోవైపు, త్వరలోనే సరకు రవాణాకూ వందే భారత్‌ తరహా రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. తక్కువ సమయంలో సరకు రవాణా చేసేందుకుగానూ ఈ హైస్పీడ్‌ పార్సిల్‌ రైలు సేవలను మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. 
 
తొలి దశలో భాగంగా దిల్లీ ఎన్‌సీఆర్‌ నుంచి ముంబై వరకు సరకు రవాణా రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ రైళ్లను తయారుచేస్తున్నారు. రైలులోని ఒక్కో కోచ్‌లో 1,800 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండే ఆటోమేటిక్‌ స్లైడింగ్‌ ప్లగ్‌ డోర్లు ఉంటాయట. పార్సిళ్లను సులువుగా లోడింగ్‌ / అన్‌లోడింగ్‌ చేసేలా రోలర్‌ ఫ్లోర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments