పూర్తిస్థాయి లాక్డౌన్ వైపు ప్రధాని మోడీ అడుగులు???

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (22:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, సమూహ వ్యాప్తి వైపు పయనిస్తున్నట్టుగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు రంగంలోకి దిగారు. దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే పలుమార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇపుడు మరోమారు లాక్డౌన్ అంశంపై మాట్లాడేందుకు ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు షెడ్యూల్ రూపొందించారు. 16వ తేదీ మంగళవారం పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. 
 
ఇక, తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ 17వ తేదీ 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు దేశంలో 2.98 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,498 మంది మరణించారు. 1.47 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments