Webdunia - Bharat's app for daily news and videos

Install App

2600 పడకలతో అతిపెద్ద ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (20:19 IST)
దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రి హర్యానా రాష్ట్రంలో నిర్మించారు. మొత్తం 2600 పడకల సౌకర్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఆధునిక, సాంకేతికతల మేళవింపుగా నిర్మించిన ఈ ఆస్పత్రిరి అమృత హాస్పిటల్ అని పేరు పెట్టారు. 
 
ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, మాతా అమృతానందమయి తదితరులు పాల్గొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఆస్పత్రిని ఆరేళ్లపాటు శ్రమించి నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో పూర్తిగా ఆటోమేటిక్ ల్యాబ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో వైద్య రంగానికి, ఆధ్యాత్మికతకు ఎంతో సామీప్యత ఉందన్నారు. ఇందుకో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆధ్యాత్మిక - ప్రైవేటు భాగస్వామ్యమే కారణమని తెలిపారు. 
 
ఈ ఆస్పత్రిని 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో పరిశోధనల కోసం ఏడు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించగా, 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విభాగం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments