Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రివర్గం విస్తరణపై దృష్టిసారించిన ప్రధాని మోడీ.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి ఛాన్స్..

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (09:47 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి చొప్పున అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఈ నెలాఖరు నుంచి 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు ముందుగానే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర వర్గాల సమాచారం. ఇందులో భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
 
కాగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యేడాది మే 31వ తేదీన తొలి మంత్రివర్గం ఏర్పాటైంది. 2021లో జూలై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిసి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులతో ఏకంగా 78 మంది మంత్రులతో జంబో కేబినెట్‌ను ఆయన ఏర్పాటుచేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ యేడాది తెలంగాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, వచ్చే యేడాది ఏప్రిల్, మే నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలన్న సంకల్పంతో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments