Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (14:21 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 22వ తేదీన అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ తదితరలు ఆహ్వానం పంపించారు. దీనికి ప్రధాని మోడీ సైతం ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఆహ్వానం తనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. దీంతో ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ అమెరికాలో రికార్డు సృష్టించనున్నారు.
 
కాగా, ఈ నెల 22వ తేదీన ప్రధాని మోడీ అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత దేశ భవిష్యత్ కార్యాచరణ, ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్ళు తదితర అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఓ అధికారిక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కాగా, మోడీకి ఇది రెండో అధికారిక అమెరికా పర్యటన. 2016 జూన్‌లో ఆయన తొలిసారిగా అగ్రరాజ్యంలో పర్యటించారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మాత్రమే అమెరికా చట్టసభల్లో రెండు పర్యాయాలు ప్రసంగించారని భారత అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments