Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (10:02 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం పెను విషాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ హృదయ విదాకర ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. 
 
కాగా, ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ సజీవంగా బయటపడ్డాడు. మిగిలిన 241 మంది ప్రయాణికులు అగ్నికోరల్లో చిక్కుకుని దహనమైపోయారు. ఈ మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా ఉండటం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను దర్యాప్తు అధికారులు వెలుగులోకి తీసుకునిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments