Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నల విజయం : కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం.. ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (09:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోనుంది. ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గత యేడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు విజయం సాధించారు. 

 
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగింది. సాగు చట్టాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ వ్యాప్తంగా కిసాన్ ఉద్యమాలు హోరెత్తాయి. ముఖ్యంగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగాసాగింది.

 
రైతులు ఢిల్లీ ఎర్రకోట వేదికగా చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. పైగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోడీ తాజా ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments