Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతకంతకూ పెరిగిపోతున్న ప్రధాని మోడీ పాపులారిటీ!!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (09:12 IST)
సోషల్ మీడియాలోనే కాకుండా, పలు దేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినప్పటికీ మోడీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా ఆయన ఎక్స్‌లో రికార్డు సృష్టించారు. తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు. దీంతో ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
 
'నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
 
ఇక, భారత్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు కాగా... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్లను కలిపితే 9.5 కోట్లు కాగా... ప్రధాని మోడీ ఒక్కరే 10 కోట్లతో టాప్‌లో నిలవడం విశేషం. అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఆయన అధికమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments