అంతకంతకూ పెరిగిపోతున్న ప్రధాని మోడీ పాపులారిటీ!!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (09:12 IST)
సోషల్ మీడియాలోనే కాకుండా, పలు దేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినప్పటికీ మోడీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా ఆయన ఎక్స్‌లో రికార్డు సృష్టించారు. తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు. దీంతో ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
 
'నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
 
ఇక, భారత్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు కాగా... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్లను కలిపితే 9.5 కోట్లు కాగా... ప్రధాని మోడీ ఒక్కరే 10 కోట్లతో టాప్‌లో నిలవడం విశేషం. అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఆయన అధికమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments