Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురదలో కూరుకునిపోయిన ప్రధాని ఎస్కార్ట్ హెలికాఫ్టర్

Webdunia
మంగళవారం, 2 మే 2023 (20:18 IST)
కర్నాటక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రచారం కోసం రాజకీయ నేతలు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రధాని మోడీ సైతం ఉన్నారు. అయితే, ఆయన ప్రచారంలో ఓ అపశృతి చోటు చేసుకుంది. ఆయన ఎస్కార్ హెలికాఫ్టర్ బురదలో కూరుకుని పోయింది. ఆ హెలికాప్టర్ ల్యాండైన ప్రదేశం చిత్తడి ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. 
 
కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది. దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్‌ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్‌‌కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments