Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ సంస్కృతి విశ్వవ్యాపితం : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (10:58 IST)
తమిళ భాష, సంస్కృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. తమిళ సంస్కృతి విశ్వవ్యాపితం అంటూ కొనియాడారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో తమిళనాడు ప్రత్యేక ప్రాంతం అని కితాబిచ్చారు. 
 
ప్రధాని మోడీ గురువారం చెన్నై పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రూ.32 వేల కోట్ల విలువైన 11 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో 262 కిమీ పొడవైన చెన్నై - బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవేను కూడా ఉంది. 
 
ఈ సందర్భంగా ఆయన తమిళ భాషపై అమితమైన ప్రేమాభిమానాలను చూపించారు. తమిళం శాశ్వతమైన భాషగా అభివర్ణించారు. తమిళనాడు ఓ ప్రత్యేకమైన ప్రాంతం, తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తం అని కీర్తించారు. 
 
అలాగే, కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంపై ఆయన మాట్లాడుతూ, సాంకేతిక, వైద్య కోర్సులు స్థానిక భాషల్లో అభ్యసించడం తమిళనాడు యువతకు ఎంతో లాభదాయకమని మోడీ పేర్కొన్నారు. 
 
అదేసమయంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అత్యంత దయనీయ స్థితికి దిగజారిన శ్రీలంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని ప్రకటించారు. ఆర్థికంగా తోడ్పాటు అందించడమే కాకుండా ఇంధనం, ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు అందిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments