Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్థాన్

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:15 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శత్రుదేశం పాకిస్థాన్ ఆహ్వానించింది. తమ దేశంలో పర్యటించాలని కోరింది. వచ్చే అక్టోబరు నెలలో నిర్వహించబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ (సీహెచ్‌జీ) సమావేశంలో పాల్గొనేందుకు తమ దేశానికి రావాలని పాకిస్థాన్ కోరింది. ఈ పిలుపును మోడీతో సహా షాంఘే సంస్థ‌కు చెందిన ఇతర నేతలనూ కూడా ఆహ్వానించింది. ఈ సదస్సు ఇస్లామాబాద్ కేంద్రంగా జరుగనుంది. ఈ సమావేశం గత యేడాది బిష్కెక్‌లో జరిగింది. ఇందులో భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. 
 
అయితే, పాకిస్థాన్‌తో మనకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా అక్కడ భద్రతా ఏర్పాట్లపై అనుమానాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈసారి కూడా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను పంపించే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. అయితే, జమ్మూలో ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి భద్రతపై నిఘా వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. 2015లో అప్పటి మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్‌లో పర్యటించారు. అదే చివరి పర్యటన. ఆ తర్వాత భారత్ నుంచి కేంద్రంలోని పెద్దలు ఎవరూ ఆ దేశంలో పర్యటించలేదు. 
 
ఇదిలావుంటే, సీహెచ్‌జీ అంటే ఏమిటి? ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాల పర్యవేక్షణకు ఏర్పాటైందే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ). రష్యా, చైనా నేతృత్వంలోని సీహెచీలో భారత్, పాక్ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ దీనికి అధ్యక్షత వహిస్తోంది. అక్టోబరు 15-16 తేదీల్లో సీహెచ్‌జీ శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లుచేస్తుంది. అయితే, ప్రత్యక్షంగా పాల్గొనే వీలుకుదరని నేతల కోసం వర్చువల్ విధానం ఏర్పాటు చేస్తారా లేదా అనేది పాక్ ఇంకా వెల్లడించలేదు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments