Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చేరుకున్న ప్రధాని మోడీ - యూపీ సీఎంతో విందు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (08:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఒక్క రోజు నేపాల్ పర్యటన ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మోడీ, దేవ్‌ల సమక్షంలో భారత్, నేపాల్ దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, నేపాల్‌కు రాముడికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. నేపాల్ లేకుంటే రాముడు అసంపూర్ణం అని వ్యాఖ్యానించారు. అయితే, బుద్ధుడు ఇరు దేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు ప్రతి ఒక్కరి వాడని చెప్పారు. 
 
ఇదిలావుంటే నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ లక్నోకు చేరుకున్నారు. అక్కడ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. ఆ తర్వాత యూపీ మంత్రివర్గంతో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. కాగా, యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments