Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 31 తర్వాత ఏంటి? ప్రధాని మోడీతో అమిత్ షా భేటీ!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ ఐదో దశ విధించాలా వద్దా అనే విషయంపై చర్చించినట్టు సమాచారం. 
 
అదేసమయంలో లాక్డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలూ చర్చించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ తరుణంలో కరోనా తీవ్రంగా ఉన్న జోన్లలోనే లాక్‌డౌన్ కొనసాగిస్తూ మిగతా చోట్ల ఎత్తివేసి విషయంపైన, కరోనా తీవ్రత ఉన్న చోట్ల కట్టడి చేస్తూ లేని ప్రాంతాల్లో మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశంపైనా చర్చించినట్టు సమాచారం. 
 
మరోవైపు చైనాతో వివాదాలపై కూడా మోడీ, షా చర్చించినట్లు సమాచారం. తాజా పరిణామాలపై ఇద్దరు నేతలూ చర్చించారని తెలిసింది. మూడు వారాలుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. యుద్ధానికి సై అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. చైనాను అదుపుచేసేందుకు తీసుకుంటోన్న చర్యలపై మోడీ, షా చర్చించారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments