Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 31 తర్వాత ఏంటి? ప్రధాని మోడీతో అమిత్ షా భేటీ!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ ఐదో దశ విధించాలా వద్దా అనే విషయంపై చర్చించినట్టు సమాచారం. 
 
అదేసమయంలో లాక్డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలూ చర్చించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ తరుణంలో కరోనా తీవ్రంగా ఉన్న జోన్లలోనే లాక్‌డౌన్ కొనసాగిస్తూ మిగతా చోట్ల ఎత్తివేసి విషయంపైన, కరోనా తీవ్రత ఉన్న చోట్ల కట్టడి చేస్తూ లేని ప్రాంతాల్లో మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశంపైనా చర్చించినట్టు సమాచారం. 
 
మరోవైపు చైనాతో వివాదాలపై కూడా మోడీ, షా చర్చించినట్లు సమాచారం. తాజా పరిణామాలపై ఇద్దరు నేతలూ చర్చించారని తెలిసింది. మూడు వారాలుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. యుద్ధానికి సై అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. చైనాను అదుపుచేసేందుకు తీసుకుంటోన్న చర్యలపై మోడీ, షా చర్చించారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments