కొందరి పిల్ల చేష్టల వల్ల పేదలు నష్టపోతున్నారు : పియూష్ గోయల్

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:11 IST)
కొంతమంది చేష్టల వల్ల పేదలకు అభివృద్ధికి దూరమవుతున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. గోవాలో జరిగిన వైబ్రంట్‌ గోవా బిజినెస్‌ కాన్‌క్లేవ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వారి వల్ల దేశంలో పేదవారికి న్యాయం జరగడం లేదని వాపోయారు. 
 
గోవాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి కొందరు (ఎన్జీవోలు) కోర్టులను ఆశ్రయించారు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. వీరి చర్యల వల్ల పేదవారికి న్యాయం జరుగడం లేదు. అందుకే ఇలాంటివారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలి అని వ్యాఖ్యానించారు. 
 
గోవాలో మంచి రోడ్లు నిర్మించడాన్ని, హోటళ్లు ఏర్పాటు చేయడాన్ని, విమానాశ్రయాలను నెలకొల్పడాన్ని, పోర్టులను విస్తరించడాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోవాలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? గోవా అభివృద్ధి చెందితే అక్కడ నివసించే ప్రజలు కూడా మెరుగైన జీవనాన్ని సాగిస్తారు. కానీ కొందరి చేష్టల వల్ల పేదవారు మెరుగైన జీవనాన్ని పొందలేకపోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments