మరో 206 రైళ్లకు అనుమతినిచ్చిన యూపీ సర్కారు!

Webdunia
బుధవారం, 20 మే 2020 (21:02 IST)
వలస కార్మికుల తరలింపునకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 206 రైళ్లను తమ రాష్ట్రంలోకి అనుమతిచ్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు సమ్మతం తెలిపింది. ఈ మేరకు యూపీ హోంశాఖ అదనపు కార్యదర్శి అనివాష్ అవస్థితి వెల్లడించారు. 
 
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు, కూలీలతో వచ్చే మరో 206 రైళ్ళు తమ రాష్ట్రంలోకి ప్రవేసించేందుకు అనుమతి ఇచ్చామని, ఇవి వచ్చే 48 గంటల్లో తమ రాష్ట్రానికి చేరుకుంటాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకూ 838 శ్రామిక్ రైళ్లు యూపీకి వచ్చాయని, కొత్తగా 206 రైళ్లకు అనుమతించడం ద్వారా మొత్తం 1,044 రైళ్లను తాము ఏర్పాటు చేసినట్టు అవుతుందని తెలిపారు. 
 
మరోవైపు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‍ను కట్టడి చేయడంలో అధికారులు సఫలమయ్యారని చెప్పొచ్చు. ఫలితంగా బుధవారం నమోదైన 23 కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 4926గా ఉన్నాయి. ఇందులో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments