Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం

Webdunia
ఆదివారం, 7 మే 2023 (13:15 IST)
బీహార్ రాష్ట్రంలోని సానారామ్‌లోని ఓ మురికి కాలువలో కరెన్సీ నోట్లు కనిపించాయి. వీటిని చూడగానే ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మురికి కాలువలో రూ.100, రూ.10 నోట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోటీపడి నోట్లను దక్కించుకునేందుకు జనం పోటీపడుతున్నారు.  
 
కాలువలో కరెన్సీ నోట్లు తేలడంతో నీటి అడుగున్న నోట్ల కట్టలు ఉండొచ్చని జనం ఎగబడ్డారు. నీటిపైన తేలుతున్న నోట్లను ఏరుకోవడంతో పాటు అడుగున్న మట్టి, చెత్తలో గాలించారు. కొందరు అడుగున ఉన్న మట్టిని చేతులతో ఒడ్డుకు తెచ్చిమరీ కరెన్సీ నోట్ల కోసం వెతికారు. 
 
అయితే, ఆ కరెన్సీ నోట్లు నకిలీవి కావొచ్చని మరికొందరు స్థానికులు సందేహిస్తున్నారు. స్థానికుల సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకున్నామని, అయితే, కాలువలో తమకు కరెన్సీ నోట్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఇదంతా కేవలం పూకార్లు అయివుండొచ్చని వివరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments