Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ కోళ్లను చంపేశారు.. ఎక్కడ...?

Madhya pradesh
Webdunia
సోమవారం, 1 జులై 2019 (18:39 IST)
ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను ఫ్రీగా ఇవ్వలేదని ఇద్దరు దుండగులు కోళ్లను చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం నాడు చోటుచేసుకుంది.


ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుడ్డి భాయ్‌ అనే మహిళ తన కుమార్తెతో నివసిస్తూ జీవనాధారం కోసం కూలీగా పని చేస్తోంది. కూలీ డబ్బులతో ఇంటి అవసరాలు తీరకపోయే సరికి ఇంటి వద్దనే నాలుగైదు కోళ్లను పెంచుకుంటుంది. 
 
కోళ్లు పెట్టిన గుడ్లను అమ్ముకొని.. ఆ డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటుంది. ఆదివారం ఉదయం గుడ్డి భాయ్‌ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి, ఫ్రీగా ఓ కోడిని ఇవ్వాలని ఆమె కూతురిని కోరారు. ఆమె తిరస్కరించంతో కోపగించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడున్న ఒక కోడి పుంజును చంపేశారు. మిగతా నాలుగు కోళ్లకు విషాహారం తినిపించారు. 
 
దీంతో ఒకేసారి ఐదు కోళ్లు చనిపోయాయి. చివరకు ఇంటికి చేరుకున్న గుడ్డి భాయ్ చనిపోయిన కోళ్లను తీసుకొని ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది‌. కోళ్లను చంపేసిన సురేందర్‌, సుమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments