Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (13:02 IST)
Pawan Kalyan
జూన్ 22, 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగ భక్తరగల్ మానాడు (మురుగన్ భక్తుల సదస్సు)లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అదే రోజు మధురై విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇతర బిజెపి నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. 
 
ఆయన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేస్తూ సనాతన ధర్మం, సాంప్రదాయ సాంస్కృతిక విలువల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ నుండి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు భారీగా హాజరయ్యారు. ఇకపోతే.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ నుండి విరామం తీసుకున్నాడు.
 
అలాగే ఆదివారం మధురైలో జరిగిన భారీ మురుగన్ భక్తుల సమావేశంలో తమిళనాడు అంతటా వేలాది మంది భక్తులు 'కంధ షష్టి కవసం'ను జపిస్తూ, హిందూ సంస్కృతి, మతం, సంప్రదాయాలను రక్షించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా ఆరు కీలక తీర్మానాలను ఆమోదించారు. 
 
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు, మురుగన్ భక్తులు ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రారంభమై కంద షష్టి కవసం యొక్క పెద్ద ఎత్తున పారాయణంతో ముగిసింది. 
 
 
తమిళనాడులో మురుగన్ సమావేశం ఎందుకు జరుగుతుందో అడగడం తమిళ సంస్కృతి ఆత్మను ప్రశ్నించడం లాంటిది. మన దేవుళ్ళు, మన దేవాలయాలు, మన ధర్మాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments