మూడవసారి ప్రధానిగా మోదీ.. శ్రీవారి చిత్రపటంతో పవన్-బాబు సత్కారం

సెల్వి
శుక్రవారం, 7 జూన్ 2024 (15:57 IST)
Modi_Pawan_Babu
ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఎన్నికయ్యారు. ఆయన మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ రోజు తర్వాత రాష్ట్రపతి ముందు దావా వేయబోతున్నాయి.
 
లోక్‌సభ నాయకుడిగా, ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన వెంటనే, నరేంద్ర మోదీని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మిత్రపక్షాలు ఘనంగా సత్కరించాయి. కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని నుదిటితో తాకి, గౌరవ సూచకంగా నమస్కరించారు. ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టిస్తోంది.
 
ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్‌లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు, పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా గడిపారని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా, లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ముచ్చటగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి చంద్రబాబు, పవన్ కలిసి సత్కరించారు. నరేంద్ర మోదీ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటం ఇచ్చి.. పవన్, చంద్రబాబు గౌరవించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆపై బాబు, పవన్ కలిసి మోదీకి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments