Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమానంలో ప్రయాణికుల ముక్కుల నుంచి రక్తం... ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:23 IST)
ఎయిరిండియా సంస్థకు చెందిన ఓ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. క్యాబిన్‌లో పీడన సమస్య కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మస్కట్ నుండి కాలికట్ బయల్దేరిన విమానంలో పీడనం తగ్గడంతో కొందరు ప్రయాణికులకు ముక్కు నుండి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో బాధపడ్డారు. 
 
185 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటుగా ఆదివారం మస్కట్ ఎయిర్‌పోర్ట్ నుండి కాలికట్ బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులోని ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మస్కట్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. 
 
ప్రయాణికులలో నలుగురికి ముక్కు నుంచి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో ఇబ్బందిపడ్డారు. వారందరికీ విమానాశ్రయంలో చికిత్స అందించారు. వారు కోలుకున్న తర్వాత విమానం కాలికట్ బయల్దేరింది. ప్రయాణికులలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments