Webdunia - Bharat's app for daily news and videos

Install App

విగ్గులో 5 కేజీల బంగారం అక్రమ రవాణా.. ఎలా?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (08:56 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ స్మగ్లింగ్ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నెత్తిపై ధరించిన విగ్గులో దాచి ఏకంగా ఐదు కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని కనిపెట్టారు. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఆదివారం జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఆదివారం దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్క ప్రయాణికుడిని తనిఖీ చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తలకు ధరించిన విగ్గుపై అనుమానం కలిగింది. దీంతో ఆ విగ్గును తీసుకుని నిశితంగా పరిశీలించారు. ఇందులో బంగారం పేస్ట్, ముడి బంగారం దాచిన విషయం గుర్తించారు. మొత్తం ఐదు కేజీల మేరకు ఈ బంగారం ఉంటుంది. దీని మొత్తం విలువ రూ.2.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
అలాగే, అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురుతో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments