Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (12:03 IST)
ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు గగనతలంలో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానం... శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలో సీట్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఓ ప్రయాణికుడు వద్దకు వెళ్లగా, అతడిలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించి విమాన సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో విమానంలో ఉన్న వైద్యులు అతడిని పరీక్షించగా మృతి చెందినట్టు ధృవీకరించారు. 
 
సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలానే ఉండటం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో గాల్లో ఉన్న సమయంలో మృతి ేచెందివుంటాడని అనుమానిస్తున్నారు. అతడు మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments