Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో కంటతడి పెచ్చిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (12:03 IST)
బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో భాగంగా బుధవారం కోర్టు విచారణ సందర్భంగా కంటతడి పెట్టారు. ''మేము ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాం'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వర్చువల్ పద్ధతిలో వీరిరువురూ కోర్టు విచారణకు హాజరయ్యారు.
 
"ప్రజల్లో నాకున్న ఇమేజ్ విషయం నన్ను కలవర పెడుతోంది. నేను ఎకనామిక్స్ విద్యార్థిని. మంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. నేను రాజకీయ బాధితుడ్ని. ఈడీని మా ఇంటికి రమ్మనండి, నా నియోజకవర్గానికి ఒకసారి వచ్చి చూడమనండి. నేను ఎల్ఎల్‌బీ చేశా. బ్రిటిష్ స్కాలర్‌షిప్ అందుకున్నాం. నా కుమార్తె యూకేలో ఉంటోంది. ఇలాంటి కుంభకోణంలో నేనెందుకు ఉంటాను?'' అని పార్థా చటర్జీ న్యాయమూర్తి ముందు వాపోయారు. 
 
పార్థా ఛటర్జీ బెయిలుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెస్తూ, దర్యాప్తు సంస్థకు తన క్లయింట్ సహకరిస్తున్నారని, భవిష్యత్తులో కూడా సహకరిస్తారని చెప్పారు. '' మీరు ఎలాంటి షరతులు విధించినా సరే... దయచేసి నా క్లెయింట్‌కు బెయిల్ మంజూరు చేయండి'' అని కోర్టును అభ్యర్థించారు. 
 
తన నివాసంలో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై తనకెంలాటి ఐడియా లేదని, తాను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు.  
 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments