20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (11:21 IST)
దేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం వెల్లడించారు. 23 రోజుల పాటు సాగే సమావేశాల్లో 17 పనిదినాలు ఉంటాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. సమావేశాలు సజావుగా జరగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పార్లమెంట్ పాత భవనంలో సమావేశాలు మొదలవుతాయని, మధ్యలో కొత్త భవనంలోకి మారతాయని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉందనీ, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రణరంగాన్ని తలపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మణిపూర్ అల్లర్లపై చర్చకు పట్టుపట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. 
 
మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరుపుతుండటం, అమలుకు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడుతుందన్న ప్రచారమూ సాగుతోంది. అయితే, ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments