Publish Date: Thu, 29 Jun 2023 (23:08 IST)
Updated Date: Thu, 29 Jun 2023 (23:10 IST)
వచ్చే నెల 8న ప్రధాని మోదీ వరంగల్లో పర్యటించనున్నారు. ఎట్టకేలకు ప్రధాని మోదీ పర్యటన ఫైనల్ కావడంతో బీజేపీ నేతల్లో జోష్ మొదలైంది. జోర్ణాటకలో నిర్వహించినట్టుగా తెలంగాణలోనూ అత్యధిక రోడ్ షోలు నిర్వహించాలని బీజేపీ వ్యూహాలు రచించింది.
ఈ క్రమంలోనే ర్యాలీతో పాటు హైదరాబాద్లో భారీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావించారు. కానీ విదేశీ పర్యటనల నేపథ్యంలో ప్రధాని మోదీ తన పర్యటనను వాయిదా వేశారు. తాజాగా ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.