Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధుకు పార్లమెంట్ ఉభయ సభల్లో అభినందనలు

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:34 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాయి. 
 
వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సింధును పార్లమెంటు ఉభయభలు అభినందించాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.
 
సభ ప్రారంభమైన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సింధు సాధించిన ఘనత గురించి సభలో ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకాన్ని సాధించడం సంతోషకరమని స్పీకర్ అన్నారు. 
 
ఒలింపిక్స్‌లో ఆమెకు వరుసగా ఇది రెండో పతకమని చెప్పారు. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయ మహిళ సింధు కావడం విశేషమని అన్నారు. చారిత్రాత్మకమైన విజయం అందుకున్న సింధుకు యావత్ దేశం తరపున అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. 
 
మరోవైపు పెద్దలసభలో కూడా సింధు సాధించిన విషయం గురించి మాట్లాడుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. తన అద్భుత ప్రదర్శనతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments