Webdunia - Bharat's app for daily news and videos

Install App

దద్ధరిల్లిన పార్లమెంట్.. ఇదేం బజారు కాదంటూ వెంకయ్య ఆగ్రహం

విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మంగళవారం చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయాయి. దీంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్య

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (13:23 IST)
విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మంగళవారం చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయాయి. దీంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేం బజారు కాదంటూ తెలుగు ఎంపీలపై మండిపడ్డారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. 
 
బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు వివిధ అంశాలపై ఆందోళనకి దిగారు. రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉండాలంటూ తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు స్పీకర్ తిరస్కరించటంతో పోడియం ఎదుట నినాదాలు చేశారు. రాష్ట్రాల హక్కును హరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. 
 
తెరాస ఎంపీలకితోడు ఏపీ ఎంపీలు కూడా నిరసనకి దిగారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంపై కాంగ్రెస్ కూడా చర్చకు పట్టుబట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వివిధ రాష్ట్రాల ఎంపీల ఆందోళనతో లోక్‌సభ దద్ధరిల్లింది. రెండుసార్లు వాయిదా వేసిన సభ అదుపులోకి రాకపోవటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ రేపటికి వాయిదావేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments