Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో అగ్నిప్రమాదమంటూ పుకార్లు... రన్నింగ్‌లో ఉండగా దూకేసిన ప్రయాణికులు!

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (16:51 IST)
రైలులో అగ్నిప్రమాదమంటూ పుకార్లు వచ్చాయి. దీంతో రైలు రన్నింగ్‌లో ఉండగానే అనేక మందిం ప్రయాణికులు కిందకు దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిల్‌పూర్ సమీపంలో చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం చోటుచేసుకుందన్న పుకార్లతో భయాందోళనలకు గురైన కొంతమంది ప్రయాణికులు కదులుతున్న రైల్లోంచి కిందికి దూకేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 
 
రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హౌరా - అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బరేలీలోని బిల్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో.. ఓ జనరల్‌ బోగీలో మంటలు చెలరేగినట్లు వదంతులు వ్యాప్తించాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఎమర్జెన్సీ చైను లాగారు. అంతలోనే అగ్నిప్రమాదం భయంతో పలువురు ప్రయాణికులు కదులుతున్న రైలులోనుంచి కిందికి దూకేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
 
రైలులో కొంతమంది ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని వినియోగించారని.. దీంతో మంటలు చెలరేగినట్లు భావించిన ప్రయాణికులు కిందికి దూకేశారని తొలుత అధికారులు పేర్కొన్నారు. 12 మందికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments