Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకంకావాలి : ఉద్ధవ్ ఠాక్రే

ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపు

Webdunia
గురువారం, 31 మే 2018 (18:41 IST)
ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.
 
గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ, మన దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌లోనూ అవినీతి కనపడుతోందని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించడం ఆపేసి, ఓట్ల పద్ధతిలో ఎన్నుకుంటే బాగుంటుందన్నారు. 
 
ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని, ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలని అన్నారు. తమ రాష్ట్రంలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల కౌంటింగ్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, ఎందుకు అలా జరుగుతోందో తెలిసే వరకు ఫలితాలు వెల్లడించకూడదని డిమాండ్‌ చేశారు. 
 
కాగా, ఎన్నికల ఫలితాలను వెల్లడించకూడదని శివసేన చేసిన డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పాల్ఘర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిట్‌ గెలిచినట్లు ప్రకటించి ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments