Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్‌కు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం.. ప్రాణాలు విడిచిన హక్కుల కార్యకర్త

Webdunia
గురువారం, 26 మే 2016 (13:13 IST)
డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొందరు అగంతకుల దాడితో శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగబడిన ఆమెను.. ట్రాన్స్జెండర్ కావడం వల్ల పురుషుల వార్డులో ఉంచాలా లేక మహిళా వార్డులో ఉంచాలా అనే సందేహంతో డాక్టర్లు సుమారు నాలుగు గంటలు చికిత్స చేయలేదు. సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ జీవితం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే ఖైబర్- పఖ్తున్ఖ్వ ప్రొవిన్స్‌లో ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అలీషాపై ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ట్రాన్స్జెండర్ల హక్కులకై పోరాడుతున్న అలీషా వ్యవహారం నచ్చని కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అలీషాను స్థానికులు పెషావర్లోని 'లేడీ రీడింగ్ హస్పిటల్'కు తరలించారు. 
 
బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అలీషాకు ట్రీట్మెంట్ చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చూపించారు. ట్రాన్స్జెండర్ అనే కారణంచేత చికిత్సను సరైన సమయంలో ప్రారంభించలేదు. అంతేకాదు ఆ సమయంలో అలీషా స్నేహితులతో హాస్పిటల్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments