Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో పిచ్చపిచ్చగా పాకిస్తాన్ 'స్పై'లు...?

భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక పత్రాలను పాకిస్తాన్ స్పైలు చౌర్యం చేసి వాటిని పాక్ ఉగ్రవాదులకు చేరవేస్తున్న వైనం బయటపడింది. ముఖ్యంగా ఆర్మీ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు కాజేస్తూ ఆ వివరాలను చక్కగా పాకిస్తాన్ దేశానికి చేరవేస్తున్నట్లు త

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (16:33 IST)
భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక పత్రాలను పాకిస్తాన్ స్పైలు చౌర్యం చేసి వాటిని పాక్ ఉగ్రవాదులకు చేరవేస్తున్న వైనం బయటపడింది. ముఖ్యంగా ఆర్మీ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు కాజేస్తూ ఆ వివరాలను చక్కగా పాకిస్తాన్ దేశానికి చేరవేస్తున్నట్లు తేలింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దేశంలో మరికొందరు ఇలాగే చొరబడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
భారత్‌లో పని చేస్తున్న పాకిస్థాన్ అధికారులు కూడా తమ వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. గూఢచర్యం కేసులో పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమినర్ కార్యాలయంలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతని ఇంట సోదాలు జరిపి అరెస్ట్ చేశారు. 
 
సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గరి నుంచి పట్టుబడటం గమనార్హం. ఈ అధికారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, విషయాన్ని పాక్ అధికారులకు తెలిపామని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరి దీనిపై పాకిస్తాన్ ఏమంటుందో...?

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments