ఆర్టికల్ 370 ఎఫెక్ట్: కుల్‌భూషణ్‌ కేసుపై పాక్ ఆంక్షలు

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (21:50 IST)
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌లో జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకదళ రిటైర్ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జాదవ్ కేసులో భారత రాయబార కార్యాలయం నుంచి ప్రతిబంధకం లేని న్యాయ సహాయాన్ని పాకిస్తాన్ గురువారం తోసిపుచ్చింది.
 
జూలై నెలలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరించి జాదవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకోవడానికి అంగీకరిస్తూనే.. తమ దేశ చట్టాల ప్రకారం మూడు నిబంధనలు పెడుతున్నట్లు పాక్ పేర్కొంది.
 
జాదవ్‌ను భారత అధికారులు కలిసే సమయంలో వారితో పాటు పాకిస్తాన్ అధికారి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే వీటిపై భారతదేశం అభ్యంతరం తెలిపింది.
 
వియన్నా ఒప్పందం ప్రకారం... విదేశాల్లో బందీలుగా ఉన్న వ్యక్తులను వారి మాతృదేశాలకు చెందిన అధికారులు ఏ ఆటంకం లేకుండా కలుసుకోవచ్చన్న నిబంధనను భారత్ ప్రస్తావించింది.
 
అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసినప్పటికీ పాక్ వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం. అయితే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే కుల్‌భూషణ్ వ్యవహారంలో ఆటంకాలు సృష్టిస్తోందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments