ఎడ్లబండికి ఫైన్.. నో పార్కింగ్ జోన్‌లో వుండటంతో.. జరిమానా వేశారట..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:48 IST)
ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. భారీగా జరిమానాలు విధించడం వినేవుంటాం. కానీ ఒక ఎడ్ల బండికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.. ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు. పొలం బయట ఆపిన ఎడ్లబండికి నో పార్కింగ్ జోన్‌లో పోలీసులు ఫైన్ వేసినట్లు రైతులు ఆరోపించారు. ఇలాంటి ఫైన్లు కూడా వుంటాయని రైతులు పోలీసులను ప్రశ్నించారు. 
 
వివరాల్లోకి వెళితే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో  ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతుంది. తాజాగా ఎడ్లబండికి ఫైన్ విధించడంతో రూర్కీ పట్టణంలో చేపట్టిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. 
 
ఉత్తరాఖండ్‌ పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తూ... ఆగ్రహంతో డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు.
 
చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పై అధికారుల వరకూ సమాచారం వెళ్లడంతో పోలీసులే పొరపాటు చేసినట్లు తెలుసుకున్నారు. ఇంకా ఛలానాను క్యాన్సిల్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయినప్పటికీ రైతుల్లో ఆగ్రహం హద్దుమీరిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments