Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడ్లబండికి ఫైన్.. నో పార్కింగ్ జోన్‌లో వుండటంతో.. జరిమానా వేశారట..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:48 IST)
ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. భారీగా జరిమానాలు విధించడం వినేవుంటాం. కానీ ఒక ఎడ్ల బండికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.. ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు. పొలం బయట ఆపిన ఎడ్లబండికి నో పార్కింగ్ జోన్‌లో పోలీసులు ఫైన్ వేసినట్లు రైతులు ఆరోపించారు. ఇలాంటి ఫైన్లు కూడా వుంటాయని రైతులు పోలీసులను ప్రశ్నించారు. 
 
వివరాల్లోకి వెళితే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో  ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతుంది. తాజాగా ఎడ్లబండికి ఫైన్ విధించడంతో రూర్కీ పట్టణంలో చేపట్టిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. 
 
ఉత్తరాఖండ్‌ పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తూ... ఆగ్రహంతో డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు.
 
చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పై అధికారుల వరకూ సమాచారం వెళ్లడంతో పోలీసులే పొరపాటు చేసినట్లు తెలుసుకున్నారు. ఇంకా ఛలానాను క్యాన్సిల్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయినప్పటికీ రైతుల్లో ఆగ్రహం హద్దుమీరిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments