Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా విజృంభణ.. 23 శాతం మందికి వైరస్..

Webdunia
బుధవారం, 22 జులై 2020 (10:06 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీ జనాభాలో 23శాతం మందికి కరోనా వైరస్ సోకినట్లు సర్వేలో తేలింది. దేశంలో కరోనా వైరస్‌ ప్రారంభమై దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఇన్ని నెలల్లో 23.48 శాతం మంది కరోనాకు గురయ్యారని అని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. 
 
ఢిల్లీ జనాభాలో 1.9 కోట్లలో 23శాతం అంటే దాదాపు 44.61 లక్షల మందికి కరోనా సోకినట్లే. దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రెండు రోజుల కిందట చేసిన ప్రకటనకు ఢిల్లీ సర్వే బలం చేకూర్చేలా ఉంది.  
 
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఢిల్లీ ప్రభుత్వం కలిసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జూన్‌ 27 నుంచి జూలై 10 మధ్య దశల వారీగా 21,387 మందికి పరీక్షలు చేశారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 23శాతం మంది ఇటీవల కాలంలో కరోనా బారిన పడినట్లు తేల్చారు.
 
ఆరునెలల వ్యవధిలో23 శాతం మందికి మాత్రమే వైరస్‌ సోకిందని, వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలే కారణమని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొచ్చింది.

ఢిల్లీ జనాభాలో కేవలం 23.48శాతం మందికే వైరస్‌ సోకిందని చెబుతున్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని అభిప్రాయపడింది. మిగతా జనాభాకు వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్త ఉండాలని సూచిస్తోంది. కరోనా కట్టడికి మరింత చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments