Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవయవ దానం చేసిన నవజాత శిశువు

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (16:17 IST)
సూరత్‌లో ఓ నవజాత శిశువు అవయవ దానం చేయడం చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. అక్టోబరు 13న సూరత్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమ్రేలికి చెందిన ఓ మహిళ మగబిడ్డను ప్రసవించింది. అయితే, ఆ శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌తో మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ జీవన్‌దీప్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ ఫౌండేషన్‌ (జేఓడీఎఫ్‌) మేనేజింగ్‌ ట్రస్టీ విపుల్‌ తలావియా.. శిశువు తల్లిదండ్రులను కలిసి.. అవయవదానం ప్రాధాన్యతను వారికి వివరించారు. దీంతో ఆ చిన్నారి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు సమ్మతించారు. 
 
దేశంలో అత్యంత పిన్న వయసు అవయవదాతగా ఈ పసికందును చెబుతున్నారు. నవజాత శిశువు నుంచి రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. 
 
కార్నియాను సూరత్ ఐ బ్యాంకుకు..మూత్రపిండాలను అహ్మదాబాద్‌లోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్‌కు, కాలేయాన్ని ఢిల్లీలోని లివర్ బైలరీ సైన్సెస్ ల్యాబొరేటరీకి తరలించారు. 
 
అనంతరం తొమ్మిది నెలల చిన్నారికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. కిడ్నీలను 13 ఏళ్లు, 15 ఏళ్ల చిన్నారులు ఇద్దరికి అమర్చి.. కొత్త జీవితాన్ని ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments