Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్జల ఏకాదశి.. గంగానదిలో స్నానాలు రద్దు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (19:25 IST)
గంగానదిలో స్నానాలను రద్దు చేశారు. గంగా దసరా, నిర్జల ఏకాదశి సందర్భంగా హరిద్వార్‌లో నిర్వహించనున్న గంగా నదీ స్నానాలను రద్దు చేశారు. కోవిడ్ వ్యాప్తి పెరగకూడదనే ఉద్దేశ్యంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్‌కు ఎక్కువ సంఖ్యలో హాజరుకాకూడదని అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఈ మేరకు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డి. సెంథిల్ అబుదై కృష్ణ రాజ్ ఎస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదలైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. జూన్ 20, 21 తేదీల్లో రాకూడదనే ఈ నిర్ణయం చేశామని అన్నారు.
 
ఈ రెండ్రోజుల్లో జిల్లా సరిహద్దులు కూడా మూసేయనున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని తిరిగి పంపించేస్తామని అన్నారు. 72గంటల లోపు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్టు రిపోర్టు పొందిన వారికి మాత్రమే హరిద్వార్ లోకి అనుమతిస్తారు.
 
పవిత్రమైన నదీ స్నానానికి కేవలం పురోహితులు, అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. ప్రస్తుతం హర్ కీ పౌరీతో పాటు ఇతర ఘాట్ లలో నదీ స్నానాలను పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments