Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో అన్‌లాక్? : థియేటర్లకు అనుమతి.. కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ

తెలంగాణాలో అన్‌లాక్? : థియేటర్లకు అనుమతి.. కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ
, శనివారం, 19 జూన్ 2021 (08:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా మేరకు తగ్గింది. దీంతో ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యధావిధిగా ప్రజా కార్యకలాపాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అంటే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 
 
ఈ నెల 20నుంచి అన్‌లాక్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ  అంశంపై చర్చించడానికి శనివారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరగనుంది. 
 
లాక్‌డౌన్‌తోపాటు వర్షపాతం, వానాకాలం సాగు, గోదావరి నుంచి ఎత్తిపోతలు, జల విద్యుత్తు ఉత్పత్తి తదితర అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకూ లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. 
 
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, పాజిటివిటీ రేటు 1.36శాతంగా నమోదు కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 
 
ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేసి రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు సమాచారం. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పార్కులను సైతం తెరిచే అవకాశం ఉంది. అయితే, అంతర్రాష్ట్ర బస్సులను మాత్రం ఇప్పట్లో అనుమతించరాదని ప్రభుత్వం భావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబరు నుంచి దేశంలో కరోనా థర్డ్ వేవ్?